Movies

ఈ అక్కాచెల్లెళ్ల తండ్రులు ఎవరో తెలుసా ?

నగ్మా,జ్యోతిక,రోషిణి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. నగ్మా తండ్రి వేరు, జ్యోతిక,రోషిణి ల తండ్రి వేరు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నగ్మా తల్లి షమా కాజీ మొదట అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి నగ్మా జన్మించింది. అయితే కొన్ని కారణాలతో నగ్మా తల్లితండ్రులు విడిపోయారు.

ఆ తర్వాత నగ్మా తల్లి చందర్ సదానా అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. చందర్ సదానా సినీ నిర్మాత. రెండో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి జ్యోతిక,రోషిని,సూరజ్ లు జన్మించారు. నగ్మా రెండో తండ్రి అయినా చందర్ సదానా చనిపోయే వరకు ఆయనతో ఎంతో ప్రేమ అనురాగాలతో పెరిగానని నగ్మా చాలా సందర్భాలలో చెప్పింది.