Devotional

శబరిమల ఆలయం ఓపెన్.. పంబలో ఉద్రిక్తత

కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు.. ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి శుద్ధి నిర్వహించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిని తెరిచారు. ఇవాల్టి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. ఆదివారం నుంచి భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఇటు పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు స్వామివారి దర్శనానికి బయల్దేరారు.. ఆదివారం అయ్యప్పను దర్శించుకోనున్నారు.

ఇటు ఆలయం తెరుచుకోవడంతో.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తదనంతర పరిణామాలతో ముందుగానే అప్రమత్తమయ్యారు.. భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు శనివారం ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి వెనక్కు తిప్పి పంపారు.. దీంతో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గతేడాది ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."