Politics

సీఎం కేసీఆర్ మరొక సంచలన నిర్ణయం…ఆ దిశగా అడుగులు పడుతున్నాయా…?

గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుండి ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికి కూడా సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గినా దాఖలాలు కనిపించవు. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

కాగా ఇప్పటికే మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా తీవ్రమైన వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇంతటి వాయు కాలుష్యం నుండి బయట పడాలంటే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటు, అనేక మాస్కులను ధరించి రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అలాంటి దారుణమైన పరిస్థితులు ఇంకా ఎక్కువ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు జరపనుంది. కాగా ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా కేసీఆర్ హైదరాబాద్ లోని డీజిల్ వాహనాల కోసం ప్రత్యేకంగా చర్చలు జరిపారని సమాచారం. \

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా వాయు కాలుష్యం పెరగకముందే అధిక సంఖ్యలో మొక్కలు నాటుతూ, డీజిల్ వాహనాలను సైతం నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టాలని అధికారులకు తెలిపారు. అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేవలం హైదరాబాద్ లోనే 15 లక్షలకి పైగా డీజిల్ వాహనాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా ఇక్కడ డిజిల్ వాహనాలను తగ్గించి బ్యాటరీ వాహనాలపై ఫోకస్ చేయాలనీ సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."