Politics

జగన్ కి తలనొప్పి తెచ్చి పెడుతున్న రోజా వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అమరావతి ప్రాంతంలో మాత్రం మూడు రాజధానుల ప్రకటన వెలువడినప్పటినుండి ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రోజా కారు ని నిరసన కారులు అడ్డగించిన సంగతి అందరికి తెల్సిందే. అయితే రోజా చేసిన వ్యాఖ్యలు కొత్తగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది.

నిరసన కారులు అడ్డుకోవడం తో నగరి ఎమ్మెల్యే రోజా వారి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మమ్మల్ని ఇక్కడకి రానివ్వరా? అసెంబ్లీని ఉండనివ్వరా? అని ఫైర్ అయ్యారు. అమరావతిని తరలిస్తున్నారన్న నేపథ్యంలో నిరసన చేస్తుంటే, అసెంబ్లీ ఉండనివ్వరా? అని రోజా అనడం తో ఇంకా ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొట్టినట్లుగా ఉంది. అయితే ఇప్పటికి అమరావతి ప్రాంత ప్రజల్ని, రైతుల్ని బుజ్జగించే పనిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలతో మరోసారి జగన్ కి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం లో జగన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."