బాలకృష్ణ కు ధన్యవాదాలు చెప్పుకున్న చిరంజీవి – డియర్ బ్రదర్ అంటూ ఆప్యాయ పలకరింపు…
నందమూరి బాలకృష్ణ పై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి మన దేశం అంత కూడా భయంకరమైన కరోనా వైరస్ పై ఒక రకమైన పోరాటాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే భయంకరమైన కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ సంస్థల ప్రముఖులు అందరు కూడా తమకు తోచినంత విరాళాన్ని ప్రకటిస్తున్నారు. దానికి తోడు ఈ లాక్ డౌన్ వలన కొంతమంది సినీ కార్మికులకు కూడా గత కొద్దీ రోజులుగా పని లేకుండా పోయింది. అందుకు గాను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే చిరంజీవియేర్పాటు చేసిన ఈ చారిటీ కి ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు చెప్పున మొత్తంగా కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే బాలకృష్ణ చేసిన విరాళానికి మెచ్చుకున్న చిరంజీవి అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నారు. కాగా “నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణ రూ. 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు కష్టమొచ్చిన ప్రతి సమయంలో సినీ నటులు అంతా ఒక్కటిగా ముందుకు వస్తుంది. మీ అండదండలు సినీ పరిశ్రమకు ఉండాలని” చిరంజీవి వాఖ్యానించారు.