Movies

లాక్ డౌన్ సమయంలో అనసూయ చేసిన పని తెలిస్తే షాకవుతారు…

కరోనా లాక్ డౌన్ తో ఒక్కసారిగా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక నిత్యం టీవీ షోలతో బిజీ బిజీగా ఉండే యాంకర్ అనసూయ ఇంటికే పరిమితం అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక తెగబాధపడుతోందట. అయితే ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కారణమో, లేక పిల్లలను మిస్ అవుతున్నాననే బాధో తెలియదు కానీ, తన కెరీర్ కు ఇకపై ఫుల్ స్టాప్ పెడతా అనేస్తోంది. మరి ఈ వేదాంతం ఆమెకు ఎందుకొచ్చిందో. యాంకర్ సుమ తన ఇంట్లోనుంచే వీడియో కాల్ చేసి తయారు చేసిన ప్రోగ్రాంలో అనసూయ కాస్త మూడీగా కనిపించింది. లాక్ డౌన్ లో తాను రిటైర్ అయిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చింది.

అయితే అనసూయ మాటలకు సుమ షాక్ అయిందట. ఈ లైవ్ షోలో అనసూయతో పాటు యాంకర్ రవి, రష్మీ, ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నారు. అయితే ముందు ముందు షూటింగ్స్ స్టార్ట్ అయ్యాక అనసూయ కెరీర్ మునుపటిలా బిజీగా ఉంటుందా, లేక ఇంటికే పరిమితం అవుతుందా అని అటు ఫ్యాన్స్ లో చర్చ నడుస్తోంది. అయితే అనసూయ బుల్లితెర కంటే వెండితెరపైనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తోందట. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అంధాధున్’. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు అనసూయ సంతకం చేసేసిందని టాక్.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర చేస్తుందట. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుందని డైరెక్టరే స్వయంగా ప్రకటించాడు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో సహా మరికొన్నింటిలో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ఇక గత ఏడాది ‘కథనం’ మూవీతో ఆడియన్స్ అనసూయ కు ప్రేక్షకులు పెద్ద షాకె ఇచ్చారు.