మరిన్ని అలనాటి సీరియల్స్ తో ఈటీవీ..డోంట్ మిస్.!
తెలుగు టాప్ 3 ఎంటర్టైనింగ్ ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కూస్తో ఒకటి. ఇప్పుడున్న సీరియల్స్ కన్నా ఒకప్పుడు టెలికాస్ట్ చేసిన సీరియల్స్ కు అయితే ఎనలేని ఆదరణ ఉంది. అలా అని ఇప్పుడున్న సీరియల్స్ బాగోలేవని కూడా కాదు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారుగా అలా..ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని ఛానెల్స్ తో పాటుగా ఈటీవీ ఛానెల్లోని సీరియల్ షూటింగులు కూడా నిలిచిపోయాయి.
దీనితో ఈటీవీ వారు తమ అలనాటి అద్భుతమైన ధారావాహికలను మరోసారి తమ వీక్షకులకు అందిస్తున్నారు. అలా “అలౌకిక” సీరియల్ తో మొదలు కొని “మనోజయం”, “అంతరంగాలు” మరియు “శాంతినివాసం” ధారావాహికలను అందిస్తున్నారు.అయితే ఈ సీరియళ్లను నేరుగా టెలివిజన్ తెరపై కాకుండా తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ లాక్ డౌన్ సమయంలో ఖచ్చితంగా ఇవి ఈటీవీ అభిమానులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ఖాయం అని చెప్పాలి.