Movies

ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా చూసేయండి

కరోనా సమయంలో దేశంలో ప్రముఖంగా సుశాంత్ రాజపుత్ మరణం గురించి వార్తలు విన్పిస్తున్నాయి. అతడి ఆత్మహత్య వెనుక రహస్యం చేధించాలంటే సిబిఐ విచారణ అవసరమని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఫోటో వైరల్ అవుతు న్నాయి. బీహార్ లో 1986జనవరి 21న జన్మించిన సుశాంత్ స్టడీ పాట్నాలో సాగింది. ఇక సినిమా ఛాన్సుల కోసం ఎన్నో కష్టాలు అనుభవించాడు.

సినిమాలో చాన్సు వస్తుందని ఎన్నో నిద్రలేని రాత్రులు,తిండిలేని రోజులు గడిపాడు. మొత్తానికి అష్టా- రిషిత సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ సినిమా అవకాశాల కోసం తన ప్రయత్నాన్ని ముమ్మరం చేసాడు. బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ కపూర్ తెరకెక్కించిన ‘కాయ్ పోచే’ మూవీ ద్వారా హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.

ఆ మూవీ సక్సెస్ కావడంతో వరుస ఛాన్సులు వచ్చాయి. అదేసమయంలో ధోని బయోపిక్ ఎం ఎస్ ధోని లో కూడా చేసి మరింత ఫేమస్ అయ్యాడు. పీకే,కేదారనాధ్, చిచోర్, దిల్ బే చారా వంటి సినిమాల్లో చేసాడు. మానసిక వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.