సమంతా డిమాండ్ చూస్తే షాక్ అవ్వాలసిందే…ఎన్ని కొట్లో ?
కరోనా కారణంగా సినిమా విడుదలలు ఆగిపోయాయి. సినిమా బడ్జెట్ తగ్గాలి…పారితోషకాలు తగ్గాలి అని అంటున్నారు. కానీ అది ఆచరణలో ఎవరు పెట్టటం లేదు. మన హీరోయిన్స్ కూడా కరోనా సమయంలో తమ పారితోషికాన్ని పెంచేస్తున్నారు. ఆ జాబితాలోకి అక్కినేని కోడలు సమంతా కూడా ఆ జాబితాలో చేరి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె పెంచిన పారితోషికం ఎంత అంటే ఆమె తీసుకొనే పారితోషికానికి దాదాపుగా డబల్ చేసేసింది.
ఆమె పారితోషికం 3.5 కోట్లు అని టాక్. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు దృష్టి మరల్చింది సమంత. ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఆమె ఖాతాలో పడింది. దాంతో… సమంత పారితోషికానికి రెక్కలొచ్చాయి.ఓ బేబీ వరకూ సమంత పారితోషికం 1.5 కోట్లే. మహా అయితే 2 కోట్లు. ఇప్పుడు ఏకంగా 3.5 కోట్లు అడగడంతో నిర్మాతలు అవాక్కవుతున్నారు. ఇటీవల ఓ నిర్మాత లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుతో సమంతని సంప్రదిస్తే.. 3.5 కోట్ల పారితోషికం అడిగిందట.