Movies

చరణ్ నో అంటే అఖిల్ చేస్తున్నాడా… ఇలా అయితే కష్టం

అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ మూడు సినిమాలు చేసినా హిట్ బాట పట్టలేదు. నాలుగో సినిమా పూర్తి చేసిన కరోనా కారణంగా అది విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఐదు సినిమాని పట్టా లెక్కించాడు. చరణ్ నో చెప్పిన కథను అఖిల్ ఓకే చెప్పాడట. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ సురేందర్ రెడ్డి పౌండేషన్ లో వచ్చిన ధ్రువ చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా వచ్చింది.

సైరా సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది. చరణ్ సురేందర్ రెడ్డి మరొక సినిమా చేయాల్సి ఉంది. సైరా నిరాశపరచడంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. ఈ లోపు అఖిల్ తో సినిమా చేయమని చరణ్ సూచించాడట. చరణ్ నో చెప్పిన కథ అఖిల్ కి సెట్ అవుతుందని సురేందర్ రెడ్డి తో చెప్పి ఆ ప్రయత్నం చేయమన్నాడట. అఖిల్ కి ఎంత అదృష్టం ఉందో చూడాలి. చేసిన మూడు సినిమాలు హిట్ కాలేదు. నాలుగోవ సినిమా కరోనా కారణంగా ఆగింది. సురేందర్ రెడ్డి ఆయన అఖిల్ ని హిట్ బాట పట్టిస్తాడా లేదా అనేది చూడాలి