MoviesTollywood news in telugu

అమలతో పాటు ఆమె కూడా అఖిల్ కి అమ్మే…ఎవరో తెలుసా?

Telugu actress Aamani :కనిపెంచితేనే అమ్మకాదు, అమ్మలా ఔదార్యం చూపిస్తే అందరూ అమ్మలే అవుతారు. సరిగ్గా అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్ మనసులో ఇదే ముద్ర పడింది. అందుకే అమలనే కాకుండా ఇంకో వ్యక్తిని కూడా అమ్మ అని అఖిల్ ఇప్పటికీ పిలుస్తాడట. బుడిబుడి నడకల వయస్సులోనే సిసింద్రీ సినిమాలో అద్భుత నటన కనబరచి అఖిల్ ఔరా అనిపించాడు. ఇక నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా టబు, పూజా బాత్ర గెస్ట్ రోల్స్ చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వ రరావు ఈ సినిమాను తెరకెక్కించగా, 1995 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టింది.

అందులో సాంగ్స్, నటన అన్నీ సూపర్భ్. ఇక ఈ మూవీలో అఖిల్ పేరెంట్స్ గా ఆమని, శరత్ బాబు నటించారు. అమ్మ పాత్రలో ఆమని ఎంతగా ఒదిగిపోయిందో సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో అఖిల్ నటిస్తుండగా, ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అఖిల్ తో బంధం గురించి ప్రస్తావిస్తూ, అఖిల్ ఇప్పటికీ తనను అమ్మ అని పిలుస్తాడని ఆమని చెబుతూ, ఎక్కడ కనబడినా అమ్మ అంటూ తన దగ్గరకు వస్తాడని ఆనందం వ్యక్తంచేసింది. సిసింద్రీ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభూతి గా పేర్కొంది. కాగా ప్రస్తుతం అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కుతోంది. అందులో కూడా అఖిల్ కు అమ్మగా ఆమని నటిస్తున్నట్లు టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే చేస్తోంది. ఈ ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. హీరోగా సరైన సక్సెస్ లేని అఖిల్ కి ఈ సినిమా మరి సెంటిమెంట్ గా హిట్ అందిస్తుందేమో చూడాలి