MoviesTollywood news in telugu

ఒక హీరోయిన్ అనుకోని మరొక హీరోయిన్ తో చేసిన సినిమాలు ఎన్నో…?

Tollywood Heroines :చాలా సినిమాల్లో మొదట్లో ఒక హీరోయిన్ ని అనుకున్నా,చివరకు మరో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంటుంది. మొదట ఒక హీరోయిన్ పలానా రోల్ కి అనుకున్నా తర్వాత మరో హీరోయిన్ కి ఛాన్స్ రావడం సహజంగా మారింది. ఇందుకు డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ కాక పోవటమో,మరొకటో కారణం కావచ్చు. డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెల్సిందే. అయితే హీరో రామ్ చరణ్ సరసన అనుపమ హీరోయిన్ గా చేస్తుందని ఈ సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా చేసింది. కారణమేమిటో గానీ, ఆ పాత్ర సమంతాకు దక్కింది.

అలాగే రాక్షసుడు మూవీలో రాశీ ఖన్నాను తీసుకోవాలని భావిస్తే, చివరకు అనుపమ పరమేశ్వర్ ఓకే అయ్యింది. చెలియా సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా చేయాలని అడిగితె, చివరకు అదితిరావు హైదరి నటించింది. రాజుగారి గది మూవీలో తమన్నాను హీరోయిన్ అను కుంటే,చివరకు అవికా గోర్ హీరోయిన్ గా చేసింది.జెర్సీ మూవీ హిందీ వెర్షన్ కి రశ్మిక మందాన ను తీసుకుందామనుకుంటే,ఆఖరికి మ్రునాల్ థాకూర్ నటించింది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతా గోవిందం మూవీలో తొలుత రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటే, రశ్మిక ఫైనల్ అయింది. అందాదున్ రీమేక్ లో నితిన్ సరసన పూజా హెగ్డేను అనుకున్నా నబ్బా నటేష్ సెలక్ట్ అయింది.

అంతెందుకు మహానటి సినిమాలో మొదట నిత్యా మీనన్ ని తీసుకోవాలని చాలా ట్రై చేశారట. చివరకు కీర్తి సురేష్ ఓకే అయింది. ఆ సినిమా ఆమె కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అలాగే జెంటిల్ మెన్ మూవీలో నిత్యా మీనన్ చేస్తుందనుకుంటే, సురభి ఫైనల్ అయ్యింది. ఇక అమర్ అక్బర్ ఆంటోనీఈ సినిమాలో కాజల్ ను తీసుకోవాలని అనుకుంటే, ఇలియానా ఫైనల్ అయింది.

కొచ్చాడియన్ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటే, దీపికా పదుకొనే ఫిక్స్ అయింది.ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న నారాప్ప రీమేక్ మూవీలో మొదట అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటే, ఎందుచేతనో ప్రియమణి ఫిక్స్ అయింది.