కరోనా సమయంలో పచ్చళ్లతో ఇమ్మునిటీ పెంచుకోవచ్చా…నిజం ఎంత…?
Corona Avakaya pickle :కరోనా సమయంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరూ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. శరీరంలో ఇమ్మునిటీ అంటే రోగనిరోదక శక్తి పెరిగే ఆహారాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వేసవి వచ్చిందంటే మామిడికాయతో ఆవకాయ పెట్టుకుంటాం కదా…ఆ ఆవకాయ తింటే ఇమ్మునిటీ పెరుగుతుందట. పచ్చళ్లు లేదా ఊరగాయలు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలు ఉప్పులో ఊరబెట్టి కలుపుతారు. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో ఆరోగ్యకరం అంటున్నారు. పచ్చడితో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందట. ఇది Ph లెవల్స్ తగ్గించి, శరీరంలో చెడు బ్యాక్టీరియా లేకుండా చేస్తుందని చెబుతున్నారు. అలాగే పచ్చళ్లు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చి B12, విటమిన్-డి అందిస్తాయి.
పచ్చళ్లు మంచివి కదా అని ఎక్కువగా తిన్నా మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచిది.