MoviesTollywood news in telugu

తెలుగు సీరియల్స్ నుండి ఈ ఏడాది సడన్ గా తప్పుకున్న స్టార్స్

Telugu Tv Actors : తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇందులో నటించే నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. అయితే సీరియల్స్ లో నటిస్తున్న నటీనటుల్లో కొంతమంది సడన్ గా సీరియల్స్ నుంచి తప్పుకుంటున్నారు. ఇక 2021లో ఈవిధంగా తప్పుకున్న వాళ్ళ గురించి ప్రస్తావిస్తే, జీతెలుగులో ప్రసారమయ్యే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో హీరోయిన్ గా డ్యూయెల్ రోల్ చేసిన చైత్రా రాయ్ ఈ ఏడాది హఠాత్తుగా తప్పుకుంది. సీరియల్ లో కంటిన్యూ గా నటించడం వలన పర్సనల్ లైఫ్ కి టైం కేటాయించ లేక పోతున్నారట. ఫ్యామిలీతో గడపడానికి వీలుగా సీరియల్ నుంచి తప్పుకుంది.

అలాగే ఈటీవీలో ప్రసారమవుతున్న నాపేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న మధురెడ్డి సడన్ గా ఈ ఏడాది నిష్క్రమించింది. యూనిట్ తో కొన్ని సమస్యలు తలెత్తడం వలన తప్పుకుంది.జీతెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో రెండవ కోడలిగా కీర్తి ధనుష్ నటించింది. అయితే ఈమె తల్లి కాబోతున్న కారణంగా సీరియల్ నుంచి సడన్ గా తప్పుకుంది.ఇదే ఛానల్ లో ప్రసారమయ్యే కల్యాణ వైభోగమే సీరియల్ లో హీరోగా జై పాత్రలో విజె సన్నీ నటించాడు. కొన్ని ప్లాన్స్ అభివృద్ధి చేసుకోడానికి వీలుగా సీరియల్ నుంచి కొన్ని నెలల క్రితం తప్పుకున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న నాపేరు మీనాక్షి సీరియల్ నుంచి వీణ పొన్నప్ప కూడా సడన్ గా తప్పుకుంది.

స్టార్ మాలో ప్రసారమయ్యే కేరాఫ్ అనసూయ సీరియల్ లో హీరోగా నటించిన ప్రజ్వల రవి కొన్ని రోజుల క్రితం తప్పుకున్నాడు. ఆరోగ్య సమస్యల వలన తప్పుకున్నాడట. అయితే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ లో చందన్ కుమార్ హీరోగా నటించాడు.

ఇటీవల కొత్తగా పెళ్లవడం వలన సీరియల్ నుంచి తప్పుకున్నాడు.ఇదే ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసికి సపోర్ట్ చేసే అంకిత పాత్రలో శిరీషా నటించింది. అయితే కరోనా మహమ్మారి భయంతో సీరియల్ నుంచి తప్పుకుంది. అలాగే ఈటీవీలో అభిషేకం సీరియల్ నుంచి కూడా ఈమె తప్పుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్ లో గీత పాత్రలో నటించిన ప్రియాంక అమ్ము తన పాత్ర ముగియడంతో తప్పుకుంది.