MoviesTollywood news in telugu

చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా గురించి నమ్మలేని నిజాలు

chuttaalunnaaru jagratta Movie :నటుడు,దర్శకుడు,నిర్మాత ఎం బాలయ్య నిర్మించిన మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ మూవీ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఒకటి. బివి ప్రసాద్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో కృష్ణ డబుల్ రోల్ వేసాడు. శ్రీదేవి, కవిత హీరోయిన్స్. తండ్రి వారసత్వంగా ఆస్తిని దక్కించుకున్న వనజ చుట్టాల కారణంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కొందో, చివరకు తన ప్రియుడి సాయంతో ఎలా బయటపడిందో అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది.

1980 ఆగస్టు 8న 25సెంటర్స్ లో 35థియేటర్స్ లో చుట్టాలున్నారు జాగ్రత్త మూవీ రిలీజయింది. క్రైమ్ ఉన్నా సరే, వినోదానికి పెద్ద పీట వేసిన ఈ మూవీలో వనజ పాత్రలో శ్రీదేవి నటించింది. కథనం కొత్తదనంతో సాగడంతో మాస్ ఆడియన్స్ ని బాగా అలరించిన సినిమాగా నిల్చింది. ఒంగులులో 100డేస్ ఆడిన కృష్ణ తొలిసినిమా ఇదే. విజయవాడ అలంకార థియేటర్ లో 7లక్షలు గ్రాస్ తెచ్చి, అడవిరాముడు,యమగోల,శంకరాభరణం వంటి మూవీస్ సరసన నిల్చింది.

గుంటూరు, విశాఖ వంటి సెంటర్స్ లో డైరెక్ట్ 100డేస్ ఆడిన సినిమా ఇది. రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక అంటూ సాగే పాట, అప్పన్న తన్నామన్నా సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ఇదే సినిమా1982లో తమిళంలో రజనీకాంత్ హీరోగా శ్రీదేవి, రాధిక హీరోయిన్స్ గా రీమేక్ చేసారు. 1983లో మవాలి పేరిట హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేసారు. తెలుగు,తమిళంలో శ్రేదేవి చేసిన క్యారెక్టర్ ని హిందీలో జయప్రద చేస్తే, తెలుగులో కవిత, తమిళంలో రాధిక పోషించిన రోల్స్ ని హిందీలో శ్రీదేవి చేయడం విశేషం.