MoviesTollywood news in telugu

ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ తనూజ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?

Mudda mandaram serial fame tanuja :బుల్లితెరపై ప్రసారమైన ముద్దమందారం సీరియల్ లో మేగోటి పార్వతిగా పరిచయమై తనూజ విశేష ఆదరణ చూరగొంది. తొలి సిరియల్ తోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె పూర్తి పేరు తనూజ గౌడ పుట్టస్వామి. కర్ణాటక రాష్ట్రము బెంగుళూరులో 1992మార్చి 5న పుట్టస్వామి, సావిత్రి దంపతులకు జన్మించిన ఈమెకు ప్రస్తుతం 29ఏళ్ళు. ఈమెకు అనూజ గౌడ, పూజ గౌడ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. న్యూ హారిజన్స్ పబ్లిక్ స్కూల్, సెయింట్ జోసెఫ్ కాలేజీలలో చదివిన ఈమె కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం.

చిన్నతనం నుంచే డాన్స్ నేర్చుకున్న తనూజ స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పాల్గొనేది. దాంతో యాక్టింగ్ మీద కూడా మక్కువ పెరిగింది. కాలేజీ ఎడ్యుకేషన్ అయ్యాక లోకల్ ఛానల్స్ లో యాంకరింగ్ స్టార్ట్ చేసింది. అదే సమయంలో ఇప్పపురం అనే షార్ట్ ఫిలిం లో చేసింది. అలా చేస్తున్న సమయంలోనే చిత్రం కాదు నిజం బాంబే బాయ్స్ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అయితే అంతగా గుర్తింపు రాలేదు. అయితే ముద్దమందారం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 5ఏళ్ళు సాగిన ఈ సీరియల్ లో తనూజ తన నటనతో చెరగని ముద్రవేసింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్దు అందుకుంది.

అప్సర అవార్డు, జి తెలుగు కుటుంబ అవార్డు కూడా తనూజ అందుకుంది. ఈమె సీరియల్స్ నటించడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకున్నా,ఈ సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో ఎంకరేజ్ చేసారు. ఇక మళ్ళీ ఎప్పుడు బుల్లితెరపై నటిస్తావంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తమిళంలో ఒక సీరియల్ లో శక్తి పాత్రలో నటించింది. ఈమెకు హీరోలలో రజనీకాంత్, నాగార్జున, హీరోయిన్స్ లో దీపికా పడుకునే అంటే ఇష్టం. లాంగ్ డ్రైవ్, పుస్తక పఠనం హాబీస్. ఒక ఎపిసోడ్ కి 19వేలు తీసుకుంటుంది. నాలుగు కోట్ల నెట్ వర్త్ ఉంటుంది. ఈమెకు 43లక్షలకు పైగా ఖరీదు గల ఓ కారుంది. ఇంకా పెళ్లికాని ఈమె కుటుంబ సభ్యులతో కల్సి ఓ సొంతింట్లో నివసిస్తోంది.