మధుర నగరిలో మధుర గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు
Madhuranagarilo Serial Madhura:మధుర నగరిలో సీరియల్లో మధురగా నటిస్తూ ఎంతోమంది ప్రేక్షక అభిమానం పొందిన జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా నటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి రెడ్డి. తొమ్మిదో సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి కొనసాగుతుంది.
ఎక్కువగా నెగిటివ్ పాత్రలతోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేస్తుంది. తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. జ్యోతి రెడ్డికి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం.కుటుంబానికి విలువ ఇచ్చే జ్యోతి రెడ్డి ఆమె తన తల్లి తండ్రి,భర్త,పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్ల వేయించుకుంది.
ఇమే డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్.వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించింది. జ్యోతి రెడ్డి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇద్దరబ్బాయిలు.వాళ్లను అమ్మ చూసు కుంటుంది అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి.సీరియల్స్ కొంత కాలం గ్యాప్ ఇచ్చి మరల ఇప్పుడు చాలా బిజీగా మారిపోయింది.