MoviesTollywood news in telugu

Kalyani: ఒకప్పటి క్రేజీ హీరోయిన్ కళ్యాణి.. ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?

Tollywood Heroine Kalyani:శేషు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉండే ఈ కేరళ భామ చేసిన తెలుగు సినిమాలు తక్కువైనా ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది. ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం ట్రెడిషనల్ లుక్ తోనే ఎంతో మందిని ఆకట్టుకుంది.

కళ్యాణి అసలు పేరు కావేరి. బాలనటిగా మలయాళంలో స్టార్ హీరోలందరికీ కూతురిగా నటించింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమా ద్వారా టాలీవుడ్ కి వచ్చింది. ఆ తరవాత అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డార సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. వసంతం, దొంగోడు, పెదబాబు వంటి హిట్ సినిమాల్లో నటించింది.

కళ్యాణి టాలీవుడ్ కి రాకముందే తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సత్యం,ధన 51 సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సూర్య కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కళ్యాణి. ఇద్దరూ మలయాళీలే కావటంతో వీరి పెళ్ళికి అభ్యంతరాలు లేవు.

అయితే పెళ్లి తర్వాత సూర్య కిరణ్ కి ఒక హిట్ కూడా రాకపోవటంతో ఆ చిరాకు,అసహనం భార్యపై చూపేవాడట. ఇక కళ్యాణి భర్తను డైరెక్టర్ గా నిలబెట్టటానికి ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి కొన్ని సినిమాలను నిర్మించింది.

ఆ సినిమాలు కూడా హిట్ కాకపోవటంతో సూర్య కిరణ్ తాగి వచ్చి కళ్యాణిని ఇబ్బంది పెట్టేవాడట. ఒకప్పుడు జగపతి బాబు,కళ్యాణిది హిట్ ఫెయిర్. దాంతో ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని బ్రహ్మాస్త్రం సినిమాకి ఛాన్స్ ఇప్పించిన అది కూడా నిరాశ పరచింది.

భర్త కారణంగా ఆర్ధికంగాను,కుటుంబ పరంగాను ఎన్నో ఇబ్బందులను పడిన కళ్యాణి తన సొంత ఊరు వెళ్లిపోయిందట. మరల హైదరాబాద్ వచ్చి విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి. ఏ అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవటానికి కళ్యాణి సిద్ధంగా ఉంది. కళ్యాణికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం. ప్రస్తుతం ఆమె ప్రొడ్యూసర్ గా బిజీగా గడుపుతోంది.