Movies

ఆచార్య సినిమా కారణంగా కొరటాల శివకు 30 కోట్లు నష్టమట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోంది.ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ ఏకంగా మూడూ సంవత్సరాలు కేటాయిస్తున్నాడు.2018లో భరత్ అనే నేను చిత్రం రిలీజ్ తరువాత మెగాస్టార్ సినిమాను ప్రారంభించేందుకు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది.ఇక సైరా నరసింహారెడ్డి తరువాత ఆచార్యను మొదలుపెట్టిన కొరటాల, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమాను 2021లోనే రిలీజ్ చేయగలనని అంగీకరించారు.

ఈ లెక్కన ఆయన ఈ సినిమాకు మూడేళ్లు కేటాయించాల్సి వస్తుంది.అయితే కొరటాల ఏడాదిన్నరలో ఒక సినిమా చేసి, సినిమాకు రూ.15 కోట్లు వసూలు చేసేవాడు.ఇప్పుడు ఆచార్య దెబ్బకు రూ.30 కోట్ల మేర నష్టపోతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."