సమయానికి ఆహారం తీసుకోకపోతే….అది తగ్గుతుందట!
Food Timeings :సాధారణంగా పిల్లలు ఆకలి అనగానే పెద్దవారు ఎదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు సమయం ఎంత అయిందో కూడా పట్టించుకోరు. అలాగే చాలా మంది పెద్దవారు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తూ ఉంటారు.
ఈ విధంగా చేయటం వలన శారీరక రుగ్మతలతో పాటు అనేక మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకే సమయానికి తినకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం వలన జీవక్రియ రేటులో తేడాలు రావటమే కాకుండా తెలివితేటలు, అధ్యయనశక్తి కూడా తగ్గుతుందట. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తినటం వలన జ్ఞాపకశక్తితో పాటు వస్తువుల్ని గుర్తుపట్టే శక్తి సామర్ధ్యాలు తగ్గుతాయట.
జీవగడియారానికి సంబంధించిన సీ.ఆర్.ఈ.బీ అనే ప్రొటీన్ శాతం కూడా తగ్గుతుంది. ఈ ప్రోటీన్ శాతం తగ్గితే అల్జీమర్స్ వస్తుంది. దాని ఫలితంగా అధ్యయనశక్తి, జ్ఞాపకశక్తి రెండూ క్షీణిస్తాయని పరిశోధకులు అంటున్నారు. కావున పెద్దవారైనా….చిన్న పిల్లలైనా సమయ పాలన పాటించి ఆహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

