మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో…?
Missamma Movie Facts : విజయా సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ ఆణి ముత్యాలే. అందులో మిస్సమ్మ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ మూవీ టివిలో వస్తుంటే, ఆడియన్స్ ఆసక్తిగా చూస్తారు. అప్పట్లో మాటల మాంత్రికుడిగా పేరొందిన పింగళి నాగేంద్రరావు మాటలు,పాటలు అందించగా సాలూరి రాజేశ్వరరావు అద్భుతమైన మెలోడీ సంగీతాన్ని అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతంగా నడిచింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీలో సావిత్రి,జమున హీరోయిన్స్ గా చేసారు. అయితే ఇందులో సావిత్రి బదులు మొదట్లో భానుమతిని తీసుకున్నారట. కొన్ని సీన్లు కూడా తీసాక,ఆమె స్తానంలో సావిత్రిని ఒకే చేశారట. భానుమతి ఒకరోజు షూటింగ్ కి ఆలస్యంగా రావడంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి ఈ నిర్ణయం తీసుకున్నారట.
అయితే భానుమతి,సావిత్రి హీరోయిన్స్ గా భావించి, తర్వాత భానుమతి ప్లేస్ లో సావిత్రిని పెట్టారు. అలాగే సావిత్రి కోసం అనుకున్న పాత్రను జమున చేత చేయించారు. అలా మార్పులతో రూపుదిద్దుకున్న మిస్సమ్మ తెలుగు చిత్ర సీమలో ఆణిముత్యంగా మిగిలింది. ఈ మూవీ తర్వాతే సావిత్రి తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకెళ్లిందని టాక్.

