Movies

కెమెరాలు లేవని అనుకోని రెచ్చిపోయిన తేజస్వి,సామ్రాట్

సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ 17వ రోజుకి ఎంటర్ అయింది. ఇప్పటికే 16మంది కంటెస్టెంట్ లలో ఇద్దరు ఎలిమినేటి అయిపోగా,కొత్తగా ఆరంభయిన నామినేషన్ ప్రక్రియలో ఐదుగురు ఎంటర్ అయ్యారు. వచ్చేవారానికి కిరీటి, గణేష్,తేజస్వి,భానుశ్రీ,గీతామాధురి ఈవారం ఎలిమినేషన్ లో వున్నారు. మంగళవారం ఎంట్రీలో భాగంగా బిగ్ బాస్ లగ్జ్ రీ టాస్క్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ ని చెరుకు ఫ్యాక్టరీగా మార్చేసారు. ఇందులో హౌస్ లో ఎల్లో టీమ్,గ్రీన్ టీమ్ అని రెండు భాగాలుగా విభజించగా,ఎల్లో టీమ్ కి కిరీటి, గ్రీన్ టీమ్ కి కౌశల్ కెప్టెన్ గా వున్నారు. అలాగే చెరుకు రసం ఫ్యాక్టరీ చెక్ మేనేజర్ గా భానుశ్రీ ని బిగ్ బాస్ నియమించారు. ఇక టాస్క్ ప్రకారం రెండు చెరుకు మిషన్లను రెండు టీమ్ లకు కేటాయించారు. అందులో చెరుకు పిండడం ద్వారా ఎవరు ఎక్కువ బాటిల్స్ లో చెరుకు రసం తీస్తారో వాళ్ళే లగ్జ్ రీ బడ్జెట్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ ప్రకరించారు.

ఇంకేముందు హౌస్ సభ్యులు రెండు టీములుగా విడిపోయి,పోటీపడి మరీ బాటిల్స్ చెరుకు రసాన్ని నింపేశారు. అయితే గ్రీన్ టీమ్ సభ్యులు కిరీటి, గణేష్,,గీతామాధురి,శ్యామల , తనిష్ లు చెరుకు రసంలో నీళ్లు కలపడం ద్వారా చెక్ మేనేజర్ భానుశ్రీ కంటపడ్డారు. ఫలితంగా ఎక్కువ బాటిల్స్ లో చెరుకురసం నింపిన ఎల్లో టీమ్ ని సెకండ్ రౌండ్ విన్నర్స్ గా బిగ్ బాస్ ప్రకటించాడు.

ఇదిలా ఉంటే గేమ్ మధ్యలో హౌస్ మెంబర్స్ ముచ్చట్లలో తేలియాడారు. ఎల్లో టీమ్ సభ్యులు తేజస్వి,దీప్తి సునైనాలు , గ్రీన్ టీమ్ సభ్యులు తనీష్,సామ్రాట్ లతో గేమ్ సంగతి గాలి కొదిలేసి కబుర్లలో మునిగిపోయారు. ఈసందర్బంగా ‘అందరు నీలా ఉండరు తేజస్వి’అని సామ్రాట్ అనడంతో,’ అందరి ముందూ నన్ను అంతమాట అంటావా’అని తేజస్వి చిన్నబుచ్చుకుంది.

అంతేకాదు అందరి ముందూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసింది. దీనికి తనీష్ ‘బుజ్జీ,నాన్న’ అంటూ ఆమెను ఓదారుస్తూ, పులిహార కబుర్లతో ఊరుకోబెడతాడు. ఇక హౌస్ మెంబర్స్ చుట్టూ వున్నా సరే , సామ్రాట్ – తేజస్విలు తమ లోకంలో తాము తేలియాడుతూ రొమాన్స్ కంటిన్యూ చేశారు. వీళ్ళిద్దరూ వేర్వేరు టీమ్ లలో వున్నా సరే ,ఒకరినొదిలి మరొకరు ఒక్క క్షణమ్ కూడా ఉండలేదంటే సీన్ ఎక్కడి దాకా చేరిందో అర్ధం చేసుకోవచ్చు.

‘నన్నెందుకు తిట్టావ్’అని తేజస్వి అడిగితే, సామ్రాట్ ఆమెను బుజ్జగించడం చూస్తుంటే వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఏదో నడుస్తోందన్న అనుమానాలు బలం చేకూరేలా యవ్వారం తయారయింది. ఈలోగా ఏదో సీక్రెట్ గా మాట్లాడాలని సామ్రాట్ ప్రయత్నిస్తే,’మైకు వుంది. అందరూ వింటారు, జాగ్రత్త’అంటూ తేజస్వి సైగ చేయడం మరో ఆశ్చర్య కరమైన అంశం.

ఇక సామ్రాట్’ఎవరు వింటే ఏమిటి నీకోసం ఏదైనా చేస్తా’అని కథలు చెప్పుకొచ్చాడు. మొత్తానికి వేర్వేరు టీమ్ లలో వున్నా సరే తమ రొమాన్స్ ఏమాత్రం ఆపకుండా ఈ బ్యూటిఫుల్ జోడీ తమ ముచ్చట్లలో కంటిన్యూ అయ్యారు.