Movies

కెజిఎఫ్ -2 వదిలేసుకున్న స్టార్ హీరోయిన్… కారణం ఏమిటో తెలుసా?

హీరోయిన్ గా వచ్చిన గుర్తింపు కంటే బాహుబలి: ది బిగినింగ్` లో శివగామి పాత్ర రమ్యకృష్ణకు పదింతలు గుర్తింపు వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిపడింది. దీంతో జాతీయ స్థాయిలో రమ్యకృష్ణ పేరు మార్మోగింది. నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతున్న సమయంలో ఇది కెరీర్ కి పెద్ద ప్లస్ అయ్యింది. టీవీ సీరియల్స్ .. రియాలిటీ షోల వైపు చూస్తున్న సమయంలో రమ్యకృష్ణ సినిమా కెరీర్ కి కొంతవరకూ ఫామ్ లోకి వచ్చేసింది. అదే సమయంలో బుల్లితెర ఇటు వెండితెర అవకాశాలు పెరిగేలా చేసింది. అయితే ఎందుకనో బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలకు రమ్యకృష్ణ ఒప్పుకోలేదు. మరి ఆమె స్వయంకృతాపరాధమా? అనే టాక్ నడుస్తోంది.

ఎందుకంటే, తాజాగా పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2లో అవకాశాన్ని మిస్ చేసుకుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. 2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్-2` అవకాశాన్ని రమ్యకృష్ణ చేజేతులా వదిలేసుకుందట. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించమని దర్శకుడు ప్రశాంత్ నీల్ తనని సంప్రదించారట. అయితే దానికి రమ్య భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ ని ఎంపిక చేసారని టాక్ నడుస్తోంది.ఇంతకీ ఈ వెటరన్ నటి కేజీఎప్ -2 నిర్మాతల్ని ఎంత పారితోషికం డిమాండ్ చేసింది? అన్నది తెలియాల్సి ఉంది.

కేజీఎఫ్ సంచలన విజయం నేపథ్యంలో కేజీఎఫ్ 2 రిలీజ్ కు ముందే ప్రీబిజినెస్ పరంగా స్పీడ్ చూపిస్తోందన్నది వాస్తవం. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ రెండవ భాగాన్ని భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయదత్ అధీరాగా కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీనా టాండన్ పై ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. ఇంకా పలువురు టాప్ స్టార్లతో భారీ కాన్వాస్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 హాట్ టాపిక్. ఇలాంటి మూవీలో రమ్య ఛాన్స్ మిస్ చేసుకోవడం ఎలా జరిగి ఉంటుందో మరి. కారణం ఏదైనా రమ్యకృష్ణ ఓ అరుదైన ప్రాజెక్ట్ లో నటించే అవకాశం చేజార్చుకోవడం ఫాన్స్ లో చర్చకు దారితీసింది.