Movies

“అల వైకుంఠపురములో” స్టీమింగ్ కు డేట్ వచ్చేసిందా.? ఆనందంలో ఫ్యాన్స్

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. అయితే ఇప్పటి రోజుల్లో మారిపోయిన ట్రెండ్ కు షాకిస్తూ ఈ చిత్రాన్ని అంత త్వరగా అయితే డిజిటల్ ఫ్లాట్ ఫారం లో అందుబాటులోకి తీసుకురామని చిత్ర యూనిట్ తేల్చి చెప్తూ ఈ మధ్య కాలంలో ఎంతో పాపులర్ అయిన “అమెజాన్ ప్రైమ్” కానీ “నెట్ ఫ్లిక్స్”లలో కానీ అందుబాటులో ఉండదని కూడా చెప్పేసరికి సినీ ఆడియెన్స్ కు ఈ చిత్రాన్ని థియేటర్లో చూడడం తప్ప ఆప్షన్ లేదు.

అలా చిత్ర యూనిట్ వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది.అంతేకాకుండా ఇప్పుడు ఈ చిత్రం వచ్చి నెల రోజులు దాటినా సరే బాక్సాఫీస్ దగ్గర అదే హవాను కొనసాగిస్తోంది.అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ కు డేట్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ నెల 8 నుంచి అందుబాటులోకి రానుంది అని ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న “సన్ నెక్స్ట్” వారు తెలుపుతున్నట్టు సమాచారం.మరి అదే తేదీన వస్తుందో లేదోచూడాలి.ఒకవేళ ఎప్పుడు వచ్చినా సరే డిజిటల్ గా ఎలాంటి వ్యూవర్
షిప్ ను రాబడుతుంతో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."