Politics

ఈరోజు రాత్రి జాతి నుద్దేశించి కీలక ప్రసంగం ఇవ్వనున్న మోడీ

భారత్ లో కరోనా వైరస్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు మోడీ ప్రజల ముందుకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగు సూచనలు చేయనున్నారు. అయితే ఇప్పటికే మోడీ చెప్పినట్లుగా ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం అవడంతో సోమవారం నుండి పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ విషయంలో మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్ల మీద తిరగడం తో మోడీ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. ఈ ప్రసంగంలో కరోనా వైరస్ నివారణకు తగు సూచనలు చేయనున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."