Movies

టాలీవుడ్ విలన్ సత్య ప్రకాష్ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రముఖ విలన్ సత్య ప్రకాష్ అందరికీ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటారు.అయితే ఈయన వందలకు పైగా చిత్రాల్లో విలన్ గా నటించారు.ఇందులో ముఖ్యంగా సాయి కుమార్ హీరో గా నటించిన పోలీస్ స్టోరీ అనే చిత్రంలో విలన్ గా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు సత్య ప్రకాష్.అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమకు వ్యక్తి గత కారణాల వల్ల దూరమయ్యాడు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన టువంటి 90ఎమ్.ఎల్ అనే చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించాడు.అయితే ఇటీవల కాలంలో సత్యప్రకాష్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు తెలుగులో హీరో రవితేజ, సునీల్, తదితరులు తమతో పాటే సినీ ఇండస్ట్రీకి వచ్చారని అప్పట్లో మా మధ్య స్నేహబంధం కూడా చాలా బాగుండేదని చెప్పుకొచ్చారు.అంతేగాక రవితేజ నేను ఇద్దరం కలిసి ఒకే మోటార్సైకిల్ పై షూటింగులకు వెళ్లేవాళ్లమని పాత రోజులు గుర్తు చేసుకున్నాడు.

అయితే క్రమేనా తాను సినిమాల్లో బిజీ అవడంతో రవితేజ కూడా హీరోగా బాగానే నిలదొక్కుకోవడంతో ఇద్దరి జీవితాల్లో బిజీ అయిపోయామని అందువల్ల ఈ మధ్య తరచూ కలవడం కుదరలేదని చెప్పుకొచ్చాడు.అయినప్పటికీ రవితేజ ఎప్పుడు ఫోన్ చేసిన చాలా ఆప్యాయంగా మాట్లాడుతాడని తెలిపాడు.

అయితే తన వ్యక్తిగత జీవితంలో కూడా తనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారని వాళ్ళతో తన వ్యక్తిగత ఆలోచనలు, సలహాలు, సూచనలు అన్ని పంచుకుంటానని తెలిపాడు.అయితే తాజాగా ఇటీవలె తన కొడుకుని సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశానని తెలిపాడు.అలాగే ఈ చిత్ర ప్రమోషన్స్ లో రవితేజని సహాయం కావాలని కోరితే వెంటనే ఓకే చెప్పాడని కూడా తెలిపాడు.అయితే గత సంవత్సరంలో సత్య ప్రకాష్ కొడుకు నిశాంత్ పేరి, ఊల్లాల ఊల్లాల అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకి కి హీరోగా పరిచయమయ్యాడు.