డైరెక్ట్ ఓటిటి లోకి రాబోతున్న మరో సినిమా.!
ఇప్పుడు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల రీత్యా చేసేది ఏమీ లేక తమ సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి దింపేస్తున్నారు. పెద్ద సినిమాలు కాదు కానీ చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే వాయిదా పడుతూ వస్తున్న సినిమాలను డిజిటల్ యాప్ సంస్థలు కొనేసుకొని విడుదల చేస్తున్నారు.
ఈ సాంప్రదాయం టాలీవుడ్ లో ఇంకా ఊపందుకోలేదు కానీ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలు మాత్రం చాలానే రెడీగా ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ లో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొన్ మగళ్ మందాల్ మొదట వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మరో సినిమా నెట్ ఫ్లిక్స్ లో రానున్నట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్లతో మోత మోగించిన దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ హీరోగా సనా, అంజనా కీర్తి హీరోయిన్లుగా శరవన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆర్ కె నగర్”. 2017 లోనే పట్టాలెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఎప్పటికప్పుడు కొత్త చిక్కులు పడుతుండడంతో ఇక ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు.