MoviesTollywood news in telugu

ఉప్పెన స్టోరీ ఇదేనట…ప్రేక్షకులు ఒప్పుకుంటారా…!?

Uppena : మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమా హీరో,హీరోయిన్ ఇద్దరికీ మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమా దర్శకుడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు కూడా కొత్తవాడే కావటం గమనార్హం.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించి టీజ‌ర్, పాట‌లు, పోస్ట‌ర్లు అన్నీ అంచనాలను అందుకోవటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఈ సినిమా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అయింది. ఈ సినిమాను ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్టోరీ ఆర్ఎక్స్ 100, క‌ల‌ర్ ఫొటోల‌ను పోలి ఉంద‌ని చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు ఒక వార్తా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

హీరోను న‌పుంశ‌కుడిని చేస్తాడ‌న్న టాక్ న‌డుస్తోంది. ఇందులో నిజ‌మెంతో తెలీదు గానీ.. ఒక‌వేళ ఆ క‌థ‌తోనే సినిమా తెర‌కెక్కి ఉంటే మాత్రం ప్రేక్ష‌కులు ఏ మాత్రం ఒప్పుకుంటార‌న్న‌ది చూడాలి. అసలు కథ ఏమిటో తెలియాలంటే పది రోజులు ఆగితే సరిపోతుంది.