మొదటిసారి పోటీపడిన చిరంజీవి,బాలయ్య…ఎవరు గెలిచారు
Chiranjeevi and Balakrishna :ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇక ఫాన్స్ మధ్య అయితే ఒక్కోసారి ఈ పోటీ ఘర్షణకు దారితీస్తుంది. కానీ నటుల మధ్య ఎంత పోటీ ఉన్నా కలిసిమెలిసి వుంటారు. తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ల మధ్య రసవత్తర పోటీ నడిచింది. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ గల అగ్ర నటులు వీళ్ళు. అయితే ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజై పోటీ ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి.
చాలా సార్లు ఇద్దరి మధ్యా గట్టి పోటీ నెలకొంది. అయితే 1983లో ఖైదీ మూవీతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాడు. 1984లో మంగమ్మగారి మనవడు మూవీతో బాలయ్య స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి ఇద్దరి మధ్యా పోటీ నెలకొంది.ఎన్టీఆర్ సీఎం కావడం,అక్కినేని సినిమాలు తగ్గించేయడం,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజుల శకం వేరు కావడంతో బాలయ్య,చిరు ల మధ్య పోటీ ఉండేది.
ఇక బాలయ్య నటించిన, కె మురళీ మోహన్ రావు డైరెక్షన్ లో డి రామానాయుడు నిర్మించిన కథానాయకుడు మూవీ 1984డిసెంబర్ 14న భారీ అంచనాలతో విడుదలైంది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. సూపర్ హిట్ తో బాలయ్య ఇమేజ్ పెరిగింది. సరిగ్గా వారం తర్వాత డిసెంబర్ 21న కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో చిరు హీరోగా రుస్తుం రిలీజయింది. ఖైదీ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ మూవీ 100డేస్ ఆడింది. అప్పట్లోనే ఇద్దరి మధ్యా పోటీకి తెరలేపింది.