MoviesTollywood news in telugu

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎక్కువ పారితోషికం ఎవరికో…?

Bigg Boss Telugu 5 remuneration :ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టినా సరే, తెలుగు బుల్లితెరపై విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తిచేసుకుంది బిగ్ బాస్ రియాల్టీ షో. ఎందుకంటే ఈ షోకి వచ్చే విమర్శలు ఏ రేంజ్ లో ఉంటాయో, ఆదరణ కూడా రెట్టింపు ఉంటుంది. గతంలో హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జున ఈ కొత్త సీజన్ కి కూడా హోస్ట్ గా చేయబోతున్నట్లు అధికారికంగా తెలుస్తున్న విషయం.

ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రోమో షూటింగ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసినట్లు టాక్. అయితే గత 4వ సీజన్ లో అంతగా పేరున్న వాళ్ళను సెలెక్ట్ చేయకపోవడంతో విమర్శలు ఎక్కువే వచ్చాయి. ఈసారి అలాంటి పొరపాట్లు లేకుంగా పక్కాగా సెలెక్షన్ చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు.

యూట్యూబ్ సిరీస్ తో ఆకట్టుకుంటున్న షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి, సినీ నటులు సురేఖా వాణి,ఇషా చావ్లా ల పేర్లు బిగ్ బాస్ సీజన్ 5కి వినిపిస్తున్నాయి. అయితే ఇందులో జస్వంత్ కి అధిక పారితోషికం ముట్టజెపుతున్నట్లు టాక్. పైగా ఎక్కువ ఇస్తేనే ఒకే చేస్తానన్న షరతు విధించడంతో నిర్వాహకులు ఒప్పుకున్నారట.