MoviesTollywood news in telugu

2021లో హిట్ అందుకున్న దర్శకుల తొలి సినిమాలు ఇవే…!

Tollywood directors got first success :ప్రతి యేటా ఇండస్ట్రీకి నూతన నటీనటులతో పాటు కొత్త డైరెక్టర్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీలో ఒడిదుడుకులు ఎదురవుతున్నా సినిమాలు తీయడంలో కొత్త డైరెక్టర్లు ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఇందులో కొందరు తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకోగా కొందరు మాత్రం నిరాశ పడ్డారు. అయితే హిట్ అందుకున్న వాళ్ళల్లో మొదటగా ప్రస్తావించాలంటే,సానా బుచ్చిబాబు పేరునే. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ ని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తూ కృతిశెట్టి హీరోయిన్ గా తీసిన ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ అయింది.

కరోనా మొదటి వేవ్ తర్వాత ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో ఉప్పెన మొదటి స్థానంలో నిల్చింది. స్టార్ హీరోలకు ధీటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి తెరకెక్కించిన శ్రీకారం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఓటిటిలో కూడా మంచి సక్సెస్ చూసింది. ఇక వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అల్లరి నరేష్ ని హీరోగా పెట్టి విజయ్ కనకమేడల తీసిన నాంది మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కామెడీతో ఈసినిమా విజయంతో అల్లరి నరేష్ కి కూడా బ్రేక్ వచ్చింది.

ఇక క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన రాజరాజ చోర మూవీ కూడా విజయాన్ని అందుకుంది. దీంతో నూతన డైరెక్టర్ హసిత్ గోలీ కి మంచి పేరు వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు సినిమా బండి పేరిట టాలీవుడ్ లో తీసిన మూవీ ఓటిటిలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇక కార్తీక్ రాపోలు అడల్ట్ మూవీగా తెరకెక్కించిన ఏక్ మినీ కథ మూవీ కూడా ఓటిటిలో విడుదలై ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది.