MoviesTollywood news in telugu

ముగ్గురు కొడుకులు సినిమా వెనక ఎంత కధ జరిగిందో తెలుసా…అసలు నమ్మలేరు

Super Star Krishna Mugguru Kodukulu Movie :సూపర్ స్టార్ కృష్ణ తల్లి నాగరత్నమ్మకు ఓ కోరిక ఉండేది. ఆమెకు కృష్ణతో పాటు ఆదిశేషగిరిరావు,హనుమంతరావు అనే కొడుకులు ఉండడంతో ముగ్గురు కొడుకులతో సినిమా తీయాలని ఆమె అభిలాషగా ఉండేది. కథ రెడీ కాకుండానే టైటిల్ రిజిస్టర్డ్ చేసేసారు.

పద్మాలయ సంస్థ ఆస్థాన రచయిత మహారధికి కథ తయారు చేయమని చెప్పారు. ఏడాది గడిచినా కథ లేకపోవడంతో నాగరత్నమ్మ సీరియస్ గా కృష్ణ దగ్గరకు వచ్చి, ముగ్గురు కొడుకులు కథ సంగతేంటని అడిగేసారు. అమ్మంటే ఎనలేని ప్రేమ కావడంతో కంగారు పడకు పరుచూరి బ్రదర్స్ తో రాయిస్తా అని బదులిచ్చారు.

చెప్పినట్టుగానే పరుచూరి సోదరులను పిలిచి, తనతో పాటు రమేష్ బాబు,మహేష్ బాబు కల్సి నటించే మూవీకి కథ రెడీ చేయమని చెప్పారు. మూవీ పేరు ముగ్గురు కొడుకులు అని కూడా చెప్పారు. అప్పటికే బిజీగా ఉన్న పరుచూరి బ్రదర్స్ రాసిన కథ కృష్ణకు నచ్చలేదు. అదే సమయంలో డైరెక్టర్ పిసి రెడ్డి ఓ లైన్ చెప్పడం, అది కృష్ణకు నచ్చడంతో రచయిత భీ శెట్టితో కల్సి ఓ కథ రెడీ చేసే పనిలో పడ్డారు.

మహేష్ చదువుకి ఇబ్బంది లేకుండా సినిమా చేయడానికి వీలుగా కథ ఉండాలని ముందే చెప్పడంతో ఊటీ నేపథ్యంతో కథ రూపొందించారు.మాటలు పరుచూరి సోదరులు అందించారు. కృష్ణ సరసన రాధ, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనమ్ ని తీసుకున్నారు. గుమ్మడి,అన్నపూర్ణ పేరెంట్స్ గా నటించగా,విలన్లుగా సత్యనారాయణ,నూతన ప్రసాద్,కోట శ్రీనివాసరావు నటించారు.

కృష్ణ, రమేష్, మహేష్ తొలిసారి కల్సి నటించగా, కృష్ణ చిన్న కూతురు కూడా ఇందులో నటించింది. ఇక మహేష్ బాబు ఓ సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తాడు. నాగరత్నమ్మ నిర్మించిన ఈ మూవీకి కృష్ణ డైరెక్షన్ చేసారు. 1988అక్టోబర్ 20న రిలీజైన ఈ మూవీని తండ్రి ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరికి అంకితం ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో నాగరత్నమ్మ సంతోషించారు. అయితే సినిమా 100రోజుల వేడుక నాటికీ ఆమె ఈలోకం వీడడం విషాదం నింపింది