సుమంత్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమిటో చూడండి
Tollywood Hero sumanth :రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రేమకథ సినిమాతో 1999లో భారీగానే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు. 1999లో ఈయన నటించిన ప్రేమకథ విడుదలైంది. సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో పాటలు మాత్రం ఆల్ టైమ్ క్లాసిక్ అయిపోయాయి. దాంతో చాలా సినిమాలు సుమంత్ దగ్గరికి వస్తే, మిస్ చేసుకున్నాడు. అందులో ప్రధానంగా ఇండస్ట్రీ హిట్ నువ్వే కావాలి మూవీ.
ఈ కథను ముందు సుమంత్ కే చెబితే కాదన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, అటునుంచి తరుణ్ దగ్గరికి చేరి, ఇండస్ట్రీ హిట్ అయింది. అలాగే సుమంత్ హీరో కాకముందే కరుణాకరణ్ ఓ సారి చూసి తను రాసుకున్న తొలిప్రేమ కథను చెప్పాడు. అయితే అప్పటికి అనుభవం లేని దర్శకుడు కావడం, అక్కినేని వర్గాలు కూడా కరుణాకరణ్ కథపై పెద్దగా నమ్మకం పెట్టుకోక పోవడంతో మొత్తానికి ఈ సినిమా కథను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి చెప్పడం, ఒకే చేయడం బ్లాక్ బస్టర్ కొట్టడం తెల్సిందే.
ఎమ్మెస్ రాజు నిర్మించిన మనసంతా నువ్వీ బ్లాక్ బస్టర్. ఈ మూవీని మహేష్ బాబును హీరోగా చేయాలనుకుంటే, సాఫ్ట్ కథ చేయడానికి
ఒప్పుకోలేదు. ఆ తర్వాత సుమంత్ దగ్గరికి వెళ్తే, కథ అంతగా నచ్చలేదని వదిలేసాడు. దాంతో దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ మూవీని ఉదయ్ కిరణ్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
సుమంత్ చేజార్చుకున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ ఆనందం. అప్పటికే సుమంత్ నటించిన ప్రేమకథ, యువకుడు, రామ్మా చిలకమ్మా, పెళ్లి సంబంధం లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలో శీను వైట్ల చెప్పిన ఆనందం కథకు కూడా సుమంత్ కనెక్ట్ కాలేకపోయాడు. అదే కథను ఆకాశ్ తో చేసి, సూపర్ హిట్ కొట్టాడు.
ఇక పూరీ జగన్నాథ్ తన ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా కథను సుమంత్ కు ముందు చెప్పాడు. దీని పేరు ముందు ఉత్తమ్ సింగ్. అయితే ఈ కథ ఎందుకో సుమంత్ నచ్చక పోవడంతో వదిలేసాడు. అయితే మహేష్ బాబు కూడా ఈ కథలో కొన్ని మార్పులు సూచించాడు. మహేష్ చెప్పినట్లే చేసి పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
క్రిష్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తూ చేసిన గమ్యం మూవీలో గాలి శీను పాత్ర కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర చేసిన అల్లరి నరేష్ కు అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇదే కథ ముందు సుమంత్ దగ్గరకు వెళ్లడం, అప్పుడే మధుమాసం, గోదావరి, గౌరి లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉండడంతో నో చెప్పాడు. ఇక సుమంత్ మరో అద్భుతమైన సినిమా నువ్వు వస్తావని కూడా వదిలేసుకున్నాడు.
నాగార్జున మంచి ఫామ్ లో ఉన్నపుడు తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ముందుగా సుమంత్ హీరోగానే ఆర్ బీ చౌదరి రీమేక్ చేయాలనుకుంటే, అప్పుడున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు. అయితే అదే కథను తన మామ నాగార్జునతో చేసి ఆర్ బీ చౌదరి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
బన్నీ హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టిన దేశముదురు కథ కూడా పూరి జగన్నాధ్ ముందుగా సుమంత్ కు చెబితే నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పాడు. దాంతో ఈ కథను అల్లు అర్జున్ కు చెప్పడం, ఓకే చేయడం, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం తెల్సిందే. ఇక నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ కథలో రవితేజ కంటే ముందు సుమంత్ దగ్గరికే వచ్చింది.
అయితే అప్పుడప్పుడే సత్యం, గౌరి లాంటి సినిమాలతో ఇమేజ్ లో ఉన్నందున ఈ సాఫ్ట్ తనకు సెట్ కాదని వదిలేసాడు. అలాగే కన్నడలో హిట్ అయిన అప్పు సినిమాను ఇడియట్ గా పూరి రీమేక్ చేసాడు. పవన్, సుమంత్ కాదనడంతో రవితేజ చేసాడు. ఈ ఒక్క సినిమాతో మాస్ రాజా మార్కెట్ టర్న్ అయింది.
అంతేకాదు, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథను కూడా ముందు సుమంత్ కే పూరీ చెప్పాడు. కానీ నచ్చలేదు. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ తన అష్టా ఛమ్మాకు ముందుగా సుమంత్ నే హీరోగా అనుకుని, కథ చెప్పాక నో అనేశాడు. దాంతో నానిని హీరోగా పరిచయం చేసాడు.