Movies

విడిపోయిన ప్రేమ జంట… సామ్రాట్ పరిస్థితి ఏమిటో పాపం

సందడిగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ టులో భాగంగా హౌస్ లో ఆదివారం 43వ ఎపిసోడ్ లో అందరూ ఊహించిందే జరిగింది. తేజస్వి ఎలిమినేట్ అయి,హౌస్ ని వీడింది. ఈవారం ఇలిమినేషన్ లో భాగంగా ప్రేమజంట సామ్రాట్, తేజశ్వినిలు ఎలిమినేషన్ జోన్ లో ఉండగా, ఓటింగ్ ద్వారా తేజస్విని ఆడియన్స్ సాగనంపారు. ఇక ఆదివారం ఎపిసోడ్ హైలెట్స్ ప్రస్తావిస్తే, వైఫ్ ఆఫ్ రామ్ మంచు లక్ష్మి మూవీ ప్రమోషన్ ని బిగ్ బాస్ హౌస్ లో నిర్వహించారు.ఈ మూవీ నానితో జరిపిన విశేషాలు,సంభాషణలు సందడి చేసాయి. హౌస్ లో ఒకరిని ఇమిటేట్ చేస్తూ నాని మాట్లాడుతుంటే, వాళ్లెవరో మంచు లక్ష్మి కనిపెట్టడం ఆకట్టుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో గల రోల్ రైడా, తేజస్వి, తనీష్,సామ్రాట్ ,దీప్తిలలో రోల్ రైడా, దీప్తి తనీష్,,లు సేఫ్ జోన్ లో ఉన్నట్టు బిగ్ బాస్ నాని ముందురోజే ప్రకటించడంతో హౌస్ లో కొనసాగే అవకాశం వచ్చింది.

ఇక మిగిలిన ఇద్దరూ తేజస్వి, సామ్రాట్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారో అని ఎదురుచూస్తున్న తరుణంలో తేజస్వి ఎలిమినేట్ అయిందని మంచు లక్ష్మి ప్రకటించడంతో భారంగా తేజస్వి హౌస్ ని వీడింది.ఇక తేజస్వి ఎలిమినేట్ అయిందని ప్రకటించడంతో ఆమె జతగాడు సామ్రాట్ షాక్ లో ఉండిపోయాడు. ఎమోషన్ కి గురయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.

కాగా బిగ్ బాస్ నుండి వీడుతున్న తేజస్వి స్టేజి మీదకు వచ్చాక కంటెస్టెంట్స్ తో కూడిన ఓ ఫోటో ఆల్బమ్ ను ఆ ఫోటో ఎదురుగా గల ఖాళీ ప్లేస్ లో వాళ్ళ గురించి కామెంట్స్ రాయమని,మార్కులు కూడా ఇవ్వాలని నాని చెప్పాడు. తనీష్, బాబు గోగినేని,సామ్రాట్ లకు పదికి పది మార్కులు వేయగా, మిగిలిన వారికి పదికి 8మార్కులు చోప్ప్పున వేసింది.

అయితే కౌశల్ కి పదికి కేవలం 5మార్కులు వేయడమే కాకుండా ఓ సంచలన కామెంట్ కూడా చేసింది. ‘కౌశల్ ఎప్పటినుంచో తెల్సు. అతడు ఓ సెల్ఫిష్,అతని విషయంలో నేను తప్పు చేయలేదని అనుకుంటున్నాను. అతని స్వార్ధం అతడు చూసుకునే కౌశల్ గురించి నాకు బాగా తెల్సు కనుక నేను చేసిందే కరక్టే అనిపిస్తోంది’అని రాసింది.

చివరిగా’కౌశల్ నీవు గేమ్ గెలుస్తావేమో గాని,నేను హౌస్ లో అందరి మనసులను గెలిచాను’అంటూ ఒకింత కంట నీరు పెట్టింది తేజస్వి. ఇక గణేష్ తలపైన గుడ్డు పగుల గొట్టి రచ్చ చేసిన కౌశల్ ని మూకుమ్మడిగా కౌశల్ ని టార్గెట్ చేస్తున్నట్లు ప్రోమో వదిలారు. మరి సోమవారం ఎపిసోడ్ లో ఎవరి తలపై ఎన్ని గుడ్లు పగులుతాయో వేచి చూడాలి.