Devotional

వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే కోటి జన్మల పుణ్యం,అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి

మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు,పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి,మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకూండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టిన రోజు అని కొందరు… ఆలా కాదు గణాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి,నవనీత గణపతి అనే ఆరు రూపాల్లో పూజిస్తారు.

అలాగే 21 రకాల పత్రీతో పూజ చేస్తారు. విశ్వరూప ప్రజాపతి సిద్ధి, బుద్ధి అనే తన ఇద్దరు కుమార్తెలను వినాయకునికి ఇచ్చి వివాహం చేసారు. . వారికి క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అందువల్ల వినాయకుణ్ణి పూజించటం వలన వల్ల క్షేమం, లాభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 13 న వచ్చింది. వినాయకుని అనుగ్రహం పొందాలంటే పూజను ఈ విధంగా చేయాలి. వినాయకునికి సమర్పించే నైవేద్యంలో మోదకాలు,ఉండ్రాళ్ళు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

వినాయకునికి ఉండ్రాళ్ళు,మోదకాలు అంటే చాలా ప్రీతి. వినాయక పూజ చేయటం వలన చేసే పనిలో ఆటంకాలు తొలగిపోవటం,కార్య సిద్ది,జ్ఞానం వంటివి కలుగుతాయి. వినాయక పూజను మధ్యాహ్న సమయంలో చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించారు. అయితే వినాయకుని పూజను ఎట్టి పరిస్థితిలో సాయంత్రం చేయకూడదు. ఎందుకంటే సాయంత్రం చేయటం వలన చంద్రుని కారణంగా దోషాలు ఏర్పడతాయి.

వినాయక చవితి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి తలస్నానము చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. షోడప ఆచార పూజలు చేయాలి. ఉపవాసం ఉండే వారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. మట్టి గణపతిని తెచ్చుకొని పువ్వులు,గంధం, కుంకుమతో అలంకారం చేయాలి. ఒక పీటపై తెల్లటి వస్త్రాన్ని వేసి బియ్యం పోసి దాని మీద మట్టి గణపతిని ఉంచి పూజ చేయాలి.

వినాయకుణ్ణి ఇంటిలోకి ఏ సమయంలో తీసుకురావాలో తెలుస్కుందాం.
ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజే విగ్రహాలను తీసుకురావాలి. అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. సెప్టెంబరు 12 ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 12.35, సాయంత్రం 5.09 నుంచి 6.40 గంటలు, రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య శుభకాలం. ఈ సమయంలో ప్రతిమలను ఇంటికి తీసుకురావాలట.

సెప్టెంబరు 12 సాయంత్రం 4 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై మర్నాడు అంటే సెప్టెంబరు 13 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అందుకే సెప్టెంబరు 13 ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని చెబుతున్నారు.అయితే వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించటం వలన మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్య చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.