Movies

సరిత తలపొగరుతో చేసిన పనికి మరో హీరోయిన్ కి ఎంత అనర్ధం జరిగిందో తెలుసా?

రాజకీయాల్లోనే కాదు అన్నింటా రాజకీయాలుంటాయి. అందునా ఇద్దరి ఆడవాళ్ళ మధ్య ఉండే గొడవలు చూస్తే,రాజకీయాలు కూడా ఎందుకు పనికిరావు. రెండు కొప్పులు కలిస్తే రచ్చ రచ్చెనని అందుకే అన్నారు. ఇక సినిమాల్లో హీరోయిన్స్ మధ్య ఉండే గొడవలు అలానే ఉంటాయి. అయితే ఎక్కడ బయటపడకుండా గుంభనంగా పైకి కనిపిస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే,ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రాధికా, సరితల మధ్య ఇలాంటి వార్ సైలెంట్ గా నడిచింది. అయితే పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు ఎవరివారు నవ్వుతూ మాట్లాడుకుంటూ,ఆ గొడవ ఊసే ఎత్తకుండా మసలుకున్నారు.

రాధిక, సరిత కల్సి తమిళంలో సెల్వి సీరియల్ లో నటించారు. అది తెలుగులో లక్ష్మి పేరిట ప్రసారం అయింది. ఇందులో ఇంచుమించు ఇద్దరికీ సమాన రోల్స్ వున్నాయి. అయితే ఆ సమయానికి సరిత సినీ ఛాన్స్ లు పూర్తిగా తగ్గిపోయాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన సరిత అప్పట్లో సౌందర్యకు డబ్బింగ్ చెప్పేవారు. ఆమె చనిపోయాక అది కూడా మిస్సయింది.

దీంతో ఆర్ధిక కష్టాలు వెంటాడంతో రాధిక నిర్మించే లక్ష్మి సీరియల్ లో నటించడానికి ఒప్పుకుని అయితే రోజుకి 30వేలరూపాయలు డిమాండ్ చేసింది. పైగా బోల్డన్నీ కండిషన్స్ విధించింది. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకే షూటింగ్ లో ఉంటానని,బయట షూటింగ్స్ కి రానని చెప్పడంతో రాధికతో మేనేజర్ విషయం వివరించాడు. అయితే ఆపాత్రకు ఆమెని సెలెక్ట్ చేయాలని రాధిక స్పష్టం చేయడంతో మేనేజరు అన్ని కండిషన్స్ కి ఒప్పుకుని సరిత నటించేలా ఒప్పించాడు.

కొన్నాళ్ల వరకూ షూటింగ్ బానే నడిచింది. అందరూ బానే పలకరించుకున్నారు. ఇక అసలు గొడవ అప్పుడు స్టార్ట్ ఐంది. ఇగోలు పెరిగాయి. నా పాత్రకు ప్రాముఖ్యత లేదని సరిత చెబుతూ,ఇలా చేస్తే,నా ఫాన్స్ ఫీలవుతారని వాదించింది. అంతేకాదు,నేను రాధిక కన్నా సీనియర్ నని, నాపేరు ముందు వేయకుండా రాధిక తర్వాత వేస్తున్నారేమిటని మరో సందర్భంలో గొడవలు దిగింది.

ఇక డబ్బింగ్ కూడా చెప్పడానికి తీరిక లేదని సరిత అనడంతో , ఆమె పాత్రను కోమాలోకి వెళ్లేలా చేసేసారు. అయితే ఇలా నా పాత్రను కోమాలోకి పంపుతారా అంటూ సరిత రచ్చరచ్చ చేసేసింది. ఇక ఇలా కోమాలోకి ఆపాత్ర వెళ్లిపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా పడిపోయి,ఆపేసి దాకా వెళ్ళింది. ఇక వీళ్లిద్దరు బయట ఫంక్షన్స్ లో కలిసికున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే సీరియల్ రాద్ధాంతం విషయం ఎక్కడా ప్రస్తావించుకోకుండా పైకి నవ్వుతూనే గడపడం వారి టాలెంట్ కి నిదర్శనం.