Movies

నటి అశ్విని గుర్తు ఉందా… ఇప్పుడు ఎలా ఉందో చూస్తే గుర్తు పట్టలేరు

ఈటీవీలో ఒకప్పుడు రెండు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి. అంతరంగాలు,కళంకిత అనే ఈ రెండు సీరియల్ టైం కి ఎక్కడా ఉన్నాసరే, ఆడవాళ్లు ఠక్కున టీవిముందు అతుక్కుపోయేవారు. సీరియల్ లో కన్నీటి సన్నివేశాలు వస్తుంటే, వీళ్ళు కూడా అయ్యో అంటూ కంటతడి పెట్టేసేవారు. అంతగా లేడీ ఫాలోయింగ్ తో ఆ సీరియల్స్ నడిచాయి. ఈ సీరియల్స్ లో నటించిన నటి అశ్విని మళయాళీ అమ్మాయి. ఈమె అసలు పేరు రుద్ర. ఈమె పుదు నెల్లు పుదునాట్ అనే మూవీతో పరిచయం అయింది. స్కూల్ ఎండింగ్ లో ఈమె చేసిన రెండు మూడు యాడ్స్ చూసి ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా ఈమెతో పుదు నెల్లు పుదునాట్ సినిమా చేసాడు.

 తర్వాత కాలంలో తమిళ, మళయాళ మూవీస్ లో ఎక్కువగా చేసిన అశ్విని తెలుగులో జయసుధతో కల్సి ఆంటీ,చిరంజీవితో కల్సి హిట్లర్,శ్రీహరితో కల్సి పోలీస్ అనే మూవీస్ లో చేసింది. 1991నుంచి 2000 మధ్యకాలంలో పాతిక చిత్రాల్లో చేసింది. ఆతర్వాత సీరియల్స్ కి షిఫ్ట్ అయింది. పేరుకి మళయాళీ అయినా,తెలుగు వారి ప్రతి ఇంటి ఆడపిల్లగా గుర్తింపు పొందింది. అంతలా ఇక్కడి ఆడవాళ్ళ చేత తన నటనతో కన్నీళ్లు పెట్టించింది. ఆ తర్వాత తెలుగులో ఛానల్స్ సంఖ్యా పెరగడం,కొత్త కొత్త యాక్టర్స్ రావడంతో అశ్విని కి ఛాన్స్ లు తగ్గిపోయాయి. 

దాంతో సింగపూర్ వెళ్లి సెటిల్ అయిపోయిన అశ్విని సింగపూర్ టివి సీరియల్స్ కూడా నటిస్తోంది. ఇక తెలుగు,తమిళ టివి సీరియల్స్ తొలిరోజుల్లో కదమట్టదు,అమ్మకానికో అమ్మాయి,అంతరంగాలు,కళంకిత,చిన్ని చిన్ని ఆశై,అంతర్ నేత్రం వంటి సీరియల్స్ లో తన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అశ్విని కి అంతరంగాలు,కళంకిత ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. టివి సీరియల్స్ కి జనం అతుక్కుపోయేలా చేస్తూ టివి సీరియల్ నటిగా జనంపై తీవ్ర ప్రభావం మొదట్లో చూపిన వాళ్లలో అశ్విని ప్రధమ స్థానం అని చెప్పవచ్చు.