అర స్పూన్ పొడి పాలలో కలిపి తాగితే 100 % నొప్పులను మాయం చేస్తుంది…సర్వ రోగ నివారిణి
knee pain relief home remedy : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు.
ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే సరిపోతుంది.
ఈ పొడి నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
చింత గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత గింజలు,పొడి రెండూ ఆయుర్వేదం షాప్స్ లేదా Online Stores లో లభ్యం అవుతాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పాటిస్తూ…ఈ పొడిని వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.