Politics

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. మిర్చి, పసుపు, ఉల్లి వంటి పంటలకు మద్ధతు ధరను నిర్ణయిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పంటలకు నిర్ణయించిన ధరల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది.

అయితే మిర్చి, పసుపు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేకున్నా రైతుల కోసం మద్దతు ధరను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్ రెడ్డి తెలిపారు. అయితే నిర్ణయించిన ధరల ప్రకారం మిర్చి క్వింటాలుకు రూ.7వేలు, పసుపు రూ.6350, ఉల్లి రూ.770, చిరుధాన్యాలు క్వింటాలుకు రూ.2500 కనీస మద్దతు ధర ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."