Devotional

ఆంజనేయ స్వామి దండకం దిండు కింద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

చాలామంది ఆంజనేయ స్వామి పుస్తకాన్ని పారాయణం చేసి దిండు కింద పెట్టుకుంటారు. అలా పెట్టడం అపచారమట. ఇక దేవుడి ఫొటోలను, దేవుడి బిళ్లలను తలకింద పెట్టుకుంటారు. ఎందుకంటే నిద్రలేవగానే కళ్లకు అద్దుకునేందుకు ఇలా చేస్తుంటారు. అది కూడా దోషభూయిష్టమేనట. మంచం ఎప్పటికీ యోగ స్థానం తప్ప ఐశ్వర్య స్థానం కాదు. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఐశ్వర్యం ఇంట్లో ఎల్లవేళలా నిండుగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పసుపూ కుంకుమ:
పసుపూ కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. మంచానికి భోగ స్థానం అని పేరు. అందుకే ఎప్పుడూ పసుపూ కుంకుమ, ఇతర పూజా ద్రవ్యాల్ని మంచంపై పెట్టకూడదు. తమలపాకులు, పూలు, పళ్లు, అవి పెట్టిన కవర్లు తీసుకొచ్చి మంచం మీద పెట్టకూడదు. దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."