Zero Investment: ఊర్లోనే ఉంటూ.. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు రూ. 50 వేలు సంపాదించే సూపర్ బిజినెస్!
Zero Investment Business Idea: ఊర్లోనే ఉంటూ.. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు రూ. 50 వేలు సంపాదించే సూపర్ బిజినెస్!
సొంత ఊళ్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా?
చేతిలో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవా? అయినా సరే ఎలాంటి కంగారు అవసరం లేదు. మీ ఇంటి దగ్గర, లేదా వ్యవసాయ క్షేత్రంలో కొద్దిగా స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 50 వేల వరకు సులభంగా సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. అదే ‘సేంద్రియ ఎరువుల (వర్మీ కంపోస్ట్) తయారీ’ వ్యాపారం.

అసలు ఈ వ్యాపారం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సేంద్రియ ఎరువులకే ఎందుకంత డిమాండ్?
ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. రసాయనాలతో పండించిన పంటల కంటే ఆర్గానిక్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు.
మరోవైపు అంతర్జాతీయ పరిణామాల (అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు) కారణంగా భవిష్యత్తులో యూరియా వంటి రసాయన ఎరువుల దిగుమతులు కష్టతరం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులకు (Organic Fertilizers) మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.

ఎరువును ఎలా తయారు చేయాలి? (తయారీ విధానం):
రైతులకు సహజ మిత్రులైన వానపాములను (Earthworms) ఉపయోగించి అత్యంత నాణ్యమైన ఎరువును మనం ఇంట్లోనే తయారు చేయవచ్చు.
ముందుగా మీ ఖాళీ స్థలంలో ఒక గొయ్యి (Pit) తీయాలి.
అందులో ఒక లేయర్ ఆవు లేదా గేదె పేడ, దానిపై వరిగడ్డి, ఆ తర్వాత ఒక లేయర్ మట్టి వేయాలి.
మళ్లీ వ్యవసాయ వ్యర్థాలు, పశువుల విసర్జితాలు వేసి, పైన మట్టి కప్పాలి. ఇలా నాలుగైదు లేయర్లుగా వేసుకోవాలి.
ఆ తర్వాత వాటిపైన వానపాములను వదిలి, ఎండ తగలకుండా గోనె పట్టాలను (Gunny bags) కప్పాలి.
దాదాపు 30 నుంచి 45 రోజుల పాటు రోజూ కొద్దిగా నీళ్లు జల్లుతూ ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి.

ఈ సమయంలో వానపాములు ఆ వ్యర్థాలన్నింటినీ తిని, పోషకాలతో కూడిన అత్యంత సారవంతమైన సేంద్రియ ఎరువుగా మారుస్తాయి.
ఆదాయం ఎలా వస్తుంది?
45 రోజుల తర్వాత గొయ్యిలో తయారైన మట్టిని బయటకు తీసి, కాస్త ఆరబెట్టి జల్లెడ పట్టాలి. అలా తయారైన ఫైన్ వర్మీ కంపోస్ట్ను ఆకర్షణీయమైన బస్తాలు, లేదా ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక రైతులు, నర్సరీలు, మరియు ఇళ్లలో మొక్కలు పెంచుకునే వారికి విక్రయించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఈ ఎరువు వాడటం వల్ల యూరియా కంటే అద్భుతమైన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సహజ వ్యర్థాలతో తయారు చేసే ఈ ఎరువుల వ్యాపారం ద్వారా ప్రతినెలా సులభంగా రూ. 50 వేల వరకు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే ప్లాన్ చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

