కేవలం 1 స్పూన్ రసం తాగితే.. కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని ఆ రోగాలు ఇట్టే మాయం!
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. కానీ, బొప్పాయి ఆకుల్లో (Papaya Leaves) అంతకు మించిన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఇవి తినడానికి కాస్త చేదుగా ఉన్నప్పటికీ.. వీటిలో దాగి ఉన్న పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని ఎన్నో మొండి రోగాలను ఈ ఆకుల రసంతో తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ లతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని నేరుగా గానీ, లేదా ఎండబెట్టి పొడి చేసుకొని గానీ వాడుకోవచ్చు. చేదుగా అనిపిస్తే ఇతర పండ్ల రసాలతో కలుపుకుని కూడా తాగొచ్చు.

బొప్పాయి ఆకులతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:
డెంగ్యూ, మలేరియాకు బెస్ట్ మెడిసిన్: డెంగ్యూ వ్యాధి బారిన పడినప్పుడు పడిపోయే బ్లడ్ ప్లేట్లెట్స్ (Platelet Count) సంఖ్యను పెంచడంలో బొప్పాయి ఆకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.
డెంగ్యూ వల్ల కాలేయం (Liver) దెబ్బతినకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ రెండు స్పూన్ల రసం తాగితే ప్లేట్లెట్స్ సహజంగా పెరుగుతాయి. అలాగే మలేరియాను కూడా ఇది సమర్థవంతంగా అరికడుతుంది.

క్యాన్సర్ నివారణ: ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. సర్వైకల్, బ్రెస్ట్, ప్యాంక్రియాటిక్, లివర్, మరియు లంగ్ క్యాన్సర్కు కారణమయ్యే వైరస్లపై పోరాడే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.
ఇన్ఫెక్షన్లకు చెక్: బొప్పాయి ఆకులో ‘కార్పిన్’ అనే పదార్థంతో సహా దాదాపు 50 యాక్టివ్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫంగస్, పరాన్నజీవులు, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుని, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.

వృద్ధాప్య ఛాయలు దూరం (Anti-Aging): ఇందులోని అమైనో ఆమ్లాలు (లైసిన్, హిస్టిడైన్, టైరోసిన్ తదితర) యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తెల్ల రక్త కణాలు (WBC), ప్లేట్లెట్స్ పునరుత్పత్తికి సహాయపడి మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
జ్వరం, జీర్ణ సమస్యలు పరార్: జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి నీటిలో 10 గ్రాముల బొప్పాయి ఆకుల పొడిని కలుపుకుని పది నిమిషాల ఆగి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గి, శరీరంలోని మలినాలు (Toxins) బయటకు పోతాయి.

మొటిమలు, మచ్చలు మాయం: బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా చేసి మొటిమలపై రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

